Dhurandhar: స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా రికార్డులు బద్ధలవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, ఉగ్రవాద లింకులు, పాక్ రాజకీయాలే బ్యాక్డ్రాప్గా నిర్మించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.
Read Also: Houthis: కీలక మలుపు.. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..
అయితే, ధురంధర్ సినిమా మొత్తం కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతంలోని గ్యాంగ్ వార్స్ గురించి సినిమాలో చూపించారు. అయితే, ఇప్పుడు ధురంధర్ భారీ సక్సెస్ కావడంలో ఈ సినిమా వసూళ్లలో తమకు కూడా వాటా కావాలని ల్యారీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సినిమా వసూళ్లలో 80 శాతం ల్యారీ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని కోరారు. ఈ సినిమాలో తమ ప్రాంతం పేరు వాడుకున్నందుకు ఆర్థికంగా తమకు డబ్బులు ఇవ్వాలని కోరుతుున్నారు. కొందరు భారత్ డబ్బులు ఇస్తేనే ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు మెరుగవుతాయని అన్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందించిన ధురంధర్: ది రివెంజ్(ధురంధర్-2) భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ స్పైగా రణ్వీర్ సింగ్ ఆకట్టుకున్నారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇలా ప్రతీ ఒక్కరూ యాక్టింగ్లో అలరించారు. ధురంధర్ -1 ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు ధురంధర్-2 ఈ రికార్డును దాటి వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
"Aditya Dhar ji, attention please…" 🤣🤣
Dhurandhar 2 has earned over ₹1000 crore
so far. Now, people of LYARI are demanding a 50% share for their development. 🤣Pakistan govt is not developing Lyari despite getting billions in loans from US and IMF. pic.twitter.com/gVaHP3R39W
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 27, 2026