Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- భారత షరతులకు లోబడి ఆపరేషన్ సిందూర్..
- సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం..
- ఉగ్రవాదాన్ని సహించేది లేదు..
- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత్ తన సొంత నిబంధనలు, షరతుల మేరకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్తాన్పై దీర్ఘకాలిక యద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని గురువారం ఆయన చెప్పారు. పాకిస్తాన్ అణు దాడి చేస్తామని బెదిరించిందని, కానీ భారత్ వెనకడుగు వేయలేదని ఆయన చెప్పారు. భారత్ సైన్యం అకస్మాత్తుగా బలగాలను పెంచే సర్జ్ సామర్థ్యం గతంలో కన్నా బలంగా ఉందని ఆయన తెలిపారు.
Read Also: DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
Also Read
భారత్ ఓ వైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఐటీకి ప్రసిద్ధి చెందుతుంటే, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదమనే ఐటీకి కేంద్రంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ కీలక మలుపు అని, ఇది కేవలం ప్రకటన కాదని, అవసరమైతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని ప్రపంచానికి చూపించామని ఆయన అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడిని సహించబోమని, అవసరమైతే కఠిన, ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా గతేడాది ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!