Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- భారత షరతులకు లోబడి ఆపరేషన్ సిందూర్..
- సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం..
- ఉగ్రవాదాన్ని సహించేది లేదు..
- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత్ తన సొంత నిబంధనలు, షరతుల మేరకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్తాన్పై దీర్ఘకాలిక యద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని గురువారం ఆయన చెప్పారు. పాకిస్తాన్ అణు దాడి చేస్తామని బెదిరించిందని, కానీ భారత్ వెనకడుగు వేయలేదని ఆయన చెప్పారు. భారత్ సైన్యం అకస్మాత్తుగా బలగాలను పెంచే సర్జ్ సామర్థ్యం గతంలో కన్నా బలంగా ఉందని ఆయన తెలిపారు.
Read Also: DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
భారత్ ఓ వైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఐటీకి ప్రసిద్ధి చెందుతుంటే, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదమనే ఐటీకి కేంద్రంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ కీలక మలుపు అని, ఇది కేవలం ప్రకటన కాదని, అవసరమైతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని ప్రపంచానికి చూపించామని ఆయన అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడిని సహించబోమని, అవసరమైతే కఠిన, ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా గతేడాది ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!