Rahul Gandhi: పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్గాంధీకి నివాళులర్పించిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గత 4 రోజులుగా లడఖ్లో పర్యటిస్తున్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్గాంధీకి నివాళులర్పించారు. ఆదివారం ఆయనకు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులు అర్పించిన రాహుల్ ‘‘మా నాన్న (రాజీవ్) చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు. పాంగాంగ్.. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రాంతమని చెప్పారు. ఈ సరస్సు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన జయంతి రోజున ఇక్కడకు వచ్చానని రాహుల్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ1984 నుండి 1989 వరకు భారతదేశ 7వ ప్రధానమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ ఆగస్టు 20, 1944న జన్మించారు.
Read also: Karnataka : కాపురంలో చిచ్చుపెట్టిన ఫోన్.. అతి కిరాతకంగా భార్యను హత్య చేసి..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని గతంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో నిజం లేదని, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఇక్కడ ప్రజలందరూ చైనా చొరబడిందనే చెబుతున్నారు. పశువులను మేపే స్థలం ఆక్రమణకు గురైందని అంటున్నారని.. ఇప్పుడు అక్కడికి వెళ్లలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ బీజింగ్ ప్రచార యంత్రంగా పనిచేస్తూ.. భారత్ పరువు తీస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్ రైడ్ చేశారు. ఆదివారం ఉదయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ప్రార్థనా సమావేశం నిర్వహించగా.. అందులో పాల్గొన్నారు. గురువారం కేంద్ర పాలిత ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటన కోసం లడఖ్ లేఖ్ చేరుకున్న రాహుల్ గాంధీ.. తరువాత తన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 5, 2019న ఆర్టికల్ 370 మరియు 35 (A)ని తొలగించిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ను లడఖ్ మరియు జమ్మూ & కాశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాహుల్ లడఖ్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్హెచ్డిసి)-కార్గిల్ ఎన్నికల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 10న జరగనున్న కార్గిల్ కౌన్సిల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!