Rahul Gandhi: పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్గాంధీకి నివాళులర్పించిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గత 4 రోజులుగా లడఖ్లో పర్యటిస్తున్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్గాంధీకి నివాళులర్పించారు. ఆదివారం ఆయనకు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులు అర్పించిన రాహుల్ ‘‘మా నాన్న (రాజీవ్) చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు. పాంగాంగ్.. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రాంతమని చెప్పారు. ఈ సరస్సు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన జయంతి రోజున ఇక్కడకు వచ్చానని రాహుల్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ1984 నుండి 1989 వరకు భారతదేశ 7వ ప్రధానమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ ఆగస్టు 20, 1944న జన్మించారు.
Read also: Karnataka : కాపురంలో చిచ్చుపెట్టిన ఫోన్.. అతి కిరాతకంగా భార్యను హత్య చేసి..
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని గతంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో నిజం లేదని, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఇక్కడ ప్రజలందరూ చైనా చొరబడిందనే చెబుతున్నారు. పశువులను మేపే స్థలం ఆక్రమణకు గురైందని అంటున్నారని.. ఇప్పుడు అక్కడికి వెళ్లలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ బీజింగ్ ప్రచార యంత్రంగా పనిచేస్తూ.. భారత్ పరువు తీస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్ రైడ్ చేశారు. ఆదివారం ఉదయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ప్రార్థనా సమావేశం నిర్వహించగా.. అందులో పాల్గొన్నారు. గురువారం కేంద్ర పాలిత ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటన కోసం లడఖ్ లేఖ్ చేరుకున్న రాహుల్ గాంధీ.. తరువాత తన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 5, 2019న ఆర్టికల్ 370 మరియు 35 (A)ని తొలగించిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ను లడఖ్ మరియు జమ్మూ & కాశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాహుల్ లడఖ్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్హెచ్డిసి)-కార్గిల్ ఎన్నికల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 10న జరగనున్న కార్గిల్ కౌన్సిల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!