నేడు భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 57వ వర్ధంతి. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని శాంతివన్లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం, నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ‘విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది.’ అని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం అంటూ షేర్ చేశారు.