పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్ ప్రాంతంలో పుల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన కీలక ఉగ్రవాది హమ్జా బుర్హాన్ గురువారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు సమాచారం. ఈ దాడి ముజఫరాబాద్లోని గోజ్రా ప్రాంతంలో జరిగినట్లు, స్కూల్ సమీపంలో బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. దాడి చేసినవారి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. అధికారికంగా పాకిస్థాన్ లేదా భారత్ ప్రభుత్వాలు ఇంకా వివరాలు విడుదల చేయలేదు.
హమ్జా బుర్హాన్ ఎవరు?
అసలు పేరు: అర్జుమంద్ గుల్జార్ దార్ (అలాసెస్: హమ్జా బుర్హాన్, డాక్టర్).
స్థానికం: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నిపోరా.
ఉగ్రవాద సంస్థ: అల్-బదర్ ఉగ్రవాద సంస్థ ఆపరేషనల్ కమాండర్.
భారత్ చర్యలు: 2022లో కేంద్ర ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది (UAPA కింద).
నిఘా సంస్థల ప్రకారం, హమ్జా బుర్హాన్ భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, డిజిటల్ రాడికలైజేషన్, ఆయుధాలు-నిధుల సరఫరా, మిలిటెంట్ల నియామకం వంటి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. ఏడేళ్ల క్రితం చెల్లుబాటు అయ్యే పత్రాలతో పాకిస్థాన్ వెళ్లి అల్-బదర్లో చేరినట్లు సమాచారం. తర్వాత ఆ సంస్థకు ఆపరేషనల్ కమాండర్గా ఎదిగాడు.
పుల్వామా దాడి గురించి.. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా సమీపంలో CRPF కాన్వాయ్పై జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘోర దాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. హమ్జా బుర్హాన్ ఈ దాడి కుట్రలో కీలక సూత్రధారుల్లో ఒకరిగా NIA చార్జ్షీట్లో పేరును చేర్చారు. అతను ఓవర్ గ్రౌండ్ వర్కర్గా కూడా పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి.
