PT Usha: రాజ్యసభ ఎంపీగా పీటీ ఉష ప్రమాణస్వీకారం

Pt Usha

Pt Usha

PT Usha: రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది.
ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆమె మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకున్నారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఉష భారతదేశపు అత్యంత ప్రసిద్ధ క్రీడాకారిణులలో ఒకరు. పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందింది. క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అని కూడా ఆమెను పిలుస్తారు.

Smriti Irani: ప్రశ్నించే దమ్ములేనోడు అడ్డుతగులుతున్నాడు.. రాహుల్‌పై స్మృతి ఫైర్

పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందింది, ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రపంచ జూనియర్ ఇన్విటేషనల్ మీట్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లు మరియు ఆసియా క్రీడలతో సహా పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లలో పతకాలు గెలుచుకుంది. ఆమె తన కెరీర్‌లో అనేక జాతీయ, ఆసియా రికార్డులను నెలకొల్పింది. క్రీడలు, ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో కెరీర్‌ను చేపట్టాలని కలలు కన్న దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతులకు ఉష ఒక రోల్ మోడల్. 1964, జూన్ 27వ తేదీన పీటీ ఉష జ‌న్మించారు. కేర‌ళ‌లోని కోజికోడ్ జిల్లాలో ఆమె పుట్టారు. . జాతీయ స్థాయిలో ఆమె అనేక ప‌త‌కాల‌ను గెలిచింది. 1982 ఏషియ‌న్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల ఈవెంట్‌లో ఆమె సిల్వర్ మెడ‌ల్స్ గెలిచింది. 1983లో కువైట్‌లో జ‌రిగిన ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌లో 400 మీట‌ర్ల ఈవెంట్‌లో గోల్డ్ గెలిచింది. 1984 ఒలింపిక్స్‌లో ఆమె 400మీట‌ర్ల హార్డిల్స్‌లో నాలుగ‌వ స్థానంలో నిలిచింది. అప్పుడు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారతదేశం మొదటి పతకాన్ని గెలుచుకోలేకపోయింది.