Priyanka Gandhi: ఇది ప్రజాస్వామ్య విజయం.. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టామన్న ప్రియాంకాగాంధీ
- అధికారంపై బీజేపీ కుట్ర పన్నింది
- అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాం
- ఇది ప్రజాస్వామ్య విజయం అన్న ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. ఆ కుట్రను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయని వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఢిల్లీలో మీడియాతో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిన్నటి ఘటనతో రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు.
ఇది కూడా చదవండి: Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్
Also Read
- NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- International Yoga Day 2026: కోల్కతాలో 35,000 మందితో కలిసి ప్రధాని మోడీ యోగా.. 2026 థీమ్ ఏమిటి?
- UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
- NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్
ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.
#WATCH | Congress MP Priyanka Gandhi Vadra holds a press conference over the Constitution (131st Amendment) Bill failing to pass in the Lok Sabha.
She says, "What happened yesterday was a huge victory for democracy. The government's conspiracy to alter the federal structure and… pic.twitter.com/8HVGHFGeIH
— ANI (@ANI) April 18, 2026
తాజావార్తలు
-
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
-
Prasidh Krishna: బుమ్రా, భువికి కూడా సాధ్యంకాలేదు.. చెపాక్ లో కిట్టు గాడి కాకరేపే రికార్డు!
-
IND W vs SA W: టీ20 ప్రపంచకప్లో భారత్కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
-
Vastu Tips: డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి? వాస్తు ప్రకారం ఈ చిన్న విషయాలను గమనిస్తున్నారా?
-
Joe Root : ప్రమాదంలో సచిన్ రికార్డు.. ఇంగ్లాండ్ స్టార్ సంచలనం..!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!