ప్రధాని మోడీ ఈరోజు, రేపు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, గుజరాత్లో పర్యటించనున్నారు. దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, గుజరాత్లో మోడీ పర్యటించనున్నారు. సిల్వాసాలో రూ.2,580 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Thandel : బుజ్జితల్లి వచ్చేసానే.. తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్
అలాగే సిల్వాసాలో నమో ఆస్పత్రి ఫేజ్-1ను మోడీ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవ్సరిలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు పూర్తిగా మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా మహిళా పోలీసులతో పహారా చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: మద్యం మత్తులో యువతుల హల్చల్.. బైక్ను ఢీ కొట్టిన కారు..