NTV Telugu Site icon

పీకేతో ప‌వార్ మ‌రోసారి భేటీ…మూడో ఫ్రంట్ ఏర్పాటౌతుందా?

దేశంలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో మోడీని, ఎన్‌డీఏను ఎదుర్కొన‌డానికి మూడో ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.  ఇందులో భాగంగా శ‌ర‌ద్‌ప‌వార్ ఇటీవ‌లే దేశంలోని వివిధ పార్టీల‌తో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.  ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని కీల‌క పార్టీలు హాజ‌రుకాలేదు.  మూడో ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టినుంచో చేస్తున్నా, స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డంలేద‌న్న‌ది వాస్త‌వం.  అయితే, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ మ‌ద్య‌వ‌ర్తిత్వంతో ప‌లు పార్టీలు ఇటీవ‌లే ముంబైలోని శ‌రద్‌ప‌వార్ నివాసంలో భేటీ అయ్యాయి.  ఈ భేటీలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  

Read: హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇంచార్జ్ లను ప్రకటించిన బీజేపీ

మూడో ఫ్రంట్‌లో కాంగ్రెస్ కూడా ఉండాల‌ని కొన్ని పార్టీలు తెలిపాయి.  దేశంలో 200ల‌కు పైగా స్థాన‌ల్లో ఆ పార్టీ త‌న ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని, కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాద‌ని కొంద‌రి నేత‌ల వాద‌న‌.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఉన్న‌ది. అయితే, బీజేపీని ఢీకొనాలి అంతే, ప్రాంతీయ పార్టీల‌తో పాటుగా కాంగ్రెస్‌కూడా ఉండాల‌ని నేత‌లు పేర్కొన్నారు.  ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ మ‌రోసారి శ‌ర‌ధ్ ప‌వార్‌తో భేటీ అయ్యారు.  ఈ భేటీలో కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.