యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఈనెల 25న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. యోగి ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా విచ్చేయనున్నారు
రాజకీయ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా యోగి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానుండటం విశేషం. హీరోయిన్ కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, బోనీ కపూర్, అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ జాబితాలో ఉన్నారు. అటు వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, సంజీవ్ గోయంకా, ఎన్.చంద్రశేఖర్కు కూడా ఆహ్వాన పత్రికలు అందాయి. కాగా యోగి ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 20వేల మంది రానున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
