LPG: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. భారత్లో పెట్రోల్, డీజిల్ భయాలు నెలకొన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ వస్తుందా.? రాదా? అనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. అయితే, కేంద్రం కూడా ఎల్పీజీ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. పైప్ ద్వారా వచ్చే నేచురల్ గ్యాస్(PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు LPG సిలిండర్లను వాడకుండా, తప్పకుండా PNGకి మారాలని సూచించింది. ఒకవేళ ఇలా చేయకుంటే LPG సరఫరా నిలిపేయవచ్చని హెచ్చరించింది.
Read Also: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
మధ్యప్రాచ్యం యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ‘‘హార్ముజ జలసంధి’’ని మూసేసింది. యూఎస్, ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్లోని చమురు, గ్యాస్ సంస్థలపై, మౌలిక సదుపాయాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. దీంతో ఇంధన సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా భారత ఎల్పీజీ దిగుమతులపై భారీ ప్రభావం పడింది. కొంత కాలం పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని వారు ఎల్పీజీని వదిలేయాలని చెబుతోంది. దేశంలో చాలా మందికి ఎల్పీజీ, పీఎన్జీ రెండు కనెక్షన్లు ఉన్నాయి. దీంతో సరఫరాపై ఒత్తిడి లేకుండా ఎల్పీజీని వదిలేయాలని కోరుతోంది. సూచనలు పాటించకపోతే ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసే అవకాశం ఉంది.
