NTV Telugu Site icon

PM Modi: రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ..

Modi

Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు లావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా మోడీ 21వ ఆసియాన్- ఇండియా సమ్మిట్.. 19వ ఈస్ట్‌ ఏషియా సదస్సులో పాల్గోనున్నారు. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్‌ అధ్యక్షతగా బాధ్యత వహిస్తుంది.

Read Also: Deputy CM Pawan Kalyan: కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. ‘పల్లె పండుగ’పై కీలక సూచనలు..

కాగా, ఈ సదస్సుల్లోనే భారత్‌ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా నరేంద్ర మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గోనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ భారతదేశంలో వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలకమని విదేశాంగ శాఖ వెల్లడించింది.