PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటన
- ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ వెల్లడించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను మోడీ సందర్శించనున్నారు. మే 15న యూఏఈలో పర్యటించనున్న మోడీ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్-యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని.. అక్కడ 45 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారని సీబీ జార్జ్ తెలిపారు.
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
ఇక మే 15 నుంచి 17 వరకు నెదర్లాండ్స్లో మోడీ పర్యటించనున్నారు. 2017 తర్వాత మోడీకి ఇది రెండో నెదర్లాండ్స్ పర్యటన కానుంది. ఈ సందర్భంగా జరగనున్న మూడో ఇండియా-నార్డిక్ సమ్మిట్లో వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, ఆవిష్కరణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక స్వీడన్, నార్వే, ఇటలీ పర్యటనలు భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఈ ఏడాది తుది రూపు దిద్దుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.
పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే మహారాజు విల్లెం-అలెగ్జాండర్, మహారాణి మాక్సిమా దంపతులను కూడా కలుస్తారు. అంతేకాకుండా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా కలుస్తారని సీబీ జార్జ్ పేర్కొన్నారు. మే 17న స్వీడన్లోని గోథెన్బర్గ్లో మోడీ అధికారిక పర్యటన జరపనున్నారు.
#WATCH | Delhi: On the Prime Minister's visit to UAE, Netherlands, Sweden, Norway and Italy, MEA Secretary (West) Sibi George says, "… Prime Minister Narendra Modi will undertake a five‑nation tour from 15–20 May, covering the UAE and four European countries — the Netherlands,… pic.twitter.com/X3DD1owrQe
— ANI (@ANI) May 13, 2026
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!