PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- మంత్రులు, సహాయమంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం
- సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని 'సేవా తీర్థ'లో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా యాక్షన్లోకి దిగారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ‘సేవా తీర్థ’లో కేంద్ర మంత్రివర్గ అత్యవసర కీలక సమావేశాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు జూనియర్ మంత్రులు (సహాయ మంత్రులు) అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లకూడదని ఆకస్మిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం దీనిని ఒక సాధారణ సమావేశంగా పరిగణించడం లేదు. విదేశాల నుంచి ల్యాండ్ అవ్వడమే ఆలస్యం ప్రధాని ఈ ఉన్నత స్థాయి భేటీకి అధ్యక్షత వహించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ కీలక భేటీలో దేశ భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై సీనియర్ ప్రభుత్వ అధికారులు ప్రధాని, మంత్రులకు సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే రెండు ప్రధానాంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
1. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు – ముడి చమురు సంక్షోభం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసు దెబ్బతినడం, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో.. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం ఈ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చింది. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ (LPG) తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. నేటి భేటీలో దీనిపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
2. మోదీ 3.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?
ఈ సమావేశం చుట్టూ ఉత్కంఠ పెరగడానికి రెండో బలమైన కారణం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. జూన్ 10 నాటికి మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో, దీనికి ముందే భారీ స్థాయిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులు జరగవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జూన్ రెండో వారంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. అందువల్ల, గురువారం సాయంత్రం జరగబోయే ఈ అత్యవసర సమావేశాన్ని సదరు పునర్వ్యవస్థీకరణకు నాందిగా (కసరత్తుగా) రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎలాంటి సంచలన నిర్ణయాలు రాబోతున్నాయి అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..