తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఫ్యాన్స్కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త
అలాగే ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఎక్స్ ట్విట్టర్లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్ను మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor : జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ ఫొటోస్..
అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశంలో, రాష్ట్రంలో మరిన్ని విజయాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి దక్కుతుందని పేర్కొన్నారు.
ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి @BJP4Telangana ను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను.@MalkaKomaraiah @AnjiReddy_BJP
— Narendra Modi (@narendramodi) March 6, 2025
విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. https://t.co/PYDKFgT20A
— Narendra Modi (@narendramodi) March 6, 2025