PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

  • మరికొన్ని గంటల్లో బెంగాల్‌లో ముగియనున్న ప్రచారం
  • పూర్తి విశ్వాసంతో తిరిగి వెళ్తున్నా
  • మళ్లీ ప్రమాణస్వీకారానికి వస్తానన్న మోడీ
Modi

Modi

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోడీ బ్యారక్‌పూర్ ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి బహిరంగ సభ. మే 4వ తేదీ ఫలితాల అనంతరం జరిగే బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కచ్చితంగా హాజరవుతాననే పూర్తి విశ్వాసంతో నేను తిరిగి వెళ్తున్నాను. ఆ విశ్వాసమే నా ఉత్సాహాన్ని మరింత రెట్టింపుజేస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘నేను హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి వస్తుండగా సుమారు రెండు కిలోమీటర్ల మేర దారికి ఇరువైపులా ప్రజల భారీ సమూహం కనిపించింది. ఇంత పొద్దున్నే వేల సంఖ్యలో ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి తరలివస్తారని నేను కలలో కూడా ఊహించలేకపోయాను.’’ అని అన్నారు.

బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. 142 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత పోలింగ్‌లో దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి విడతలో కూడా భారీగా పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.