Site icon NTV Telugu

G-20 Summit: బ్రెజిల్‌ చేరుకున్న భారత ప్రధాని.. జీ-20 సదస్సులో పాల్గొననున్న మోడీ

Modi

Modi

G-20 Summit: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్‌ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున బ్రెజిల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. జీ-20 సదస్సులో భాగంగా నేడు పలు దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది.

Read Also: Samantha old Video: సమంత 14 ఏళ్ల కిందటి వీడియో వైరల్.. ఎలా ఉందో చూడండి

అలాగే, జీ-20 సదస్సు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్​ ఇర్ఫాన్​ అలీ అహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న ఇండియా- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్​ ఆఫ్​ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ప్రదానం చేయనున్నారు. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటిస్తున్నారు.

Exit mobile version