పప్పు యాదవ్.. స్వతంత్ర ఎంపీ. బీహార్లోని పూర్నియా లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందారు. కాంగ్రెస్తో కలిసి తిరుగుతుంటారు. అయితే పప్పు యాదవ్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
పప్పు యాదవ్.. ఎంత పెద్ద భారీకాయమో చూసినోళ్లందరికీ తెలిసిందే. సరిగ్గా నడవడం కూడా చేతకాని స్థితిలో భారీ స్థూలకాయం కలిగి ఉంటారు. అలాంటిది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. భారీకాయం నుంచి స్లిమ్గా మారిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియో చూస్తే.. ఎవరికైనా డౌట్ వస్తుంది. పప్పు యాదవేనా? లేదంటే ఇంకెవరైనానా అన్న అనుమానం కలుగుతుంది. అంతగా సన్నబడ్డారు. వీడియో చూసినవాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంతగా ఎలా సన్నబడ్డారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
శనివారం సీజేపీ కార్యకర్త నిషు ఆజాద్కు సంబంధించిన కేసుపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల కంటే.. ఆయనలో కనిపించిన భారీ బరువు తగ్గుదలే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. శారీరక మార్పుపై సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆయనను గుర్తుపట్టలేకపోయామని కొందరు యూజర్లు పేర్కొన్నారు. ఇంకొందరు ఇందులో పప్పు యాదవ్ ఎక్కడున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
అయితే పప్పు యాదవ్ బరువు తగ్గడానికి కారణం ఏమిటన్న దానిపై ఆయన నుంచి గానీ, ఆయన కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మార్పుపై పప్పు యాదవ్ స్వయంగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
#WATCH | Patna, Bihar: On the case related to CJP activist Nishu Azad, Independent MP Pappu Yadav says, “Now, as long as Rahul Gandhi is not sitting at the police station for a protest, the daughter will never get justice. Today, we had to sit at the police station for three… pic.twitter.com/jUUJkBFXFw
— ANI (@ANI) September 4, 2026

