West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- మమత నివాసంలో కీలక సమావేశం రద్దు
- 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరు
- 60 మంది గైర్హాజరుతో టీఎంసీలో అసంతృప్తి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో స్థానికులు దాడికి దిగారు. ఈ దాడి వెనక బీజేపీ ఉందని టీఎంసీ ఆరోపిస్తుంటే, టీఎంసీ అంతర్గత సంక్షోభాలే దాడికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే, మేనల్లుడు అభిషేక్పై దాడి కన్నా మమతా బెనర్జీకి అతిపెద్ద షాక్లు తగులుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సమావేశానికి టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 20 మంది మాత్రమే హాజరయ్యారు. కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు చూస్తే టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఏకంగా 60 మంది రాకపోవడంతో మమతా బెనర్జీ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం తన నివాసంలో మమత ఈ భేటీని ఏర్పాటు చేసింది. శాసనసభాపక్ష నాయకుడు శోవన్దేబ్ చటోపాధ్యాయ్ ఈ భేటీకి పిలుపునిచ్చారని తెలుస్తోంది.
Also Read
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
ఇప్పటికే, టీఎంసీ నేతలు, కార్యకర్తలపై బెంగాల్ వ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. గత 15 ఏళ్లలో తృణమూల్ గుండాలు ప్రజల్ని పీడించారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో వారి చొక్కాలు విప్పి మరీ ప్రజలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలకమైన ఇద్దరు నాయకులపై దాడి జరిగితే ఎమ్మెల్యేలు హాజరయ్యే తీరిక లేకుండా ఉన్నారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ఘోష్ అన్నారు.
మరోవైపు, వరసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో జూన్ 2 మమతా బెనర్జీ నిరసన కార్యక్రమానికి దిగుతున్నట్లు ప్రకటించారు. దీనిపై కార్యచరణ సిద్ధం చేయడానికి ఎమ్మెల్యేలను పిలిచినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం, సీఎం సువేందు అధికారి దూకుడు ముందు టీఎంసీ కుదేలవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నారు. ఇక కీలక నేతలు కూడా దీదీపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!