Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో చేతులు కలుపుతుందా.. క్లారిటీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..

  • బీజేపీ కూటమిలోకి నేషనల్ కాన్ఫరెన్స్..
  • అలాంటిదేం లేదని చెప్పిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..
  • తప్పుడు కథనాలు ప్రచురిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..
Omar Abdullah

Omar Abdullah

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), బీజేపీ కలుస్తుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే, ఎన్‌సీ ఈ వాదనల్ని ఆదవారం తోసిపుచ్చింది. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది జర్నలిస్టులు ఈ వార్తలు ప్రచురిస్తున్నారని, ఈ వార్తలు పచ్చి అబద్ధమని ఎన్‌సీ ముఖ్య అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ అన్నారు.

Read Also: 2025 Honda Activa: ‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..

×
×
Ad

కేంద్రపాలి ప్రాంతాన్ని రాష్ట్ర హోదాకు మారిస్తే జమ్మూ కాశ్మీర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌సీ, బీజేపీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధమువుతందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘ఎవరైనా ఇలాంటి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడం అవమానకరం, బాధ్యతారాహిత్యం… ఈ కట్టుకథ వెనుక ఉన్న వ్యక్తిని నేను సవాలు చేస్తున్నాను. ఒమర్ అబ్దుల్లాని కలిసినట్లు ఆరోపించబడిన బీజేపీ అగ్ర నేత పేరు చెప్పంది లేదా మీ కథనాలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పండి’’ అంటూ తన్వీర్ సాదిక్ ఓ పోస్టులో చెప్పారు.

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం ఒమర్ అబ్దుల్లా కలిశారని చెప్పారు. ఈ కల్పిత కథనాలను తక్షణమే ఉపసంహరించకుంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, ఇలాంటి నిజాయితీ లేని జర్నలిజాన్ని సహించేది లేదని ఆయన అన్నారు.