Site icon NTV Telugu

CM Conrad Sangma: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది

Meghalaya Cm Conrad Sangma

Meghalaya Cm Conrad Sangma

CM Conrad Sangma: రాబోయే 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శనివారం ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన పార్టీ జాతీయ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు.”మేఘాలయలోనే కాకుండా నాగాలాండ్, త్రిపురతో సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలలో కూడా తాము ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాము” అని సంగ్మా చెప్పారు. “మా స్టాండ్ 2018లో ఉన్నదానికంటే భిన్నంగా లేదు. అప్పుడు కూడా మేము ఒంటరిగా ఉన్నాము. బీజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాము. ఒక పార్టీగా మన ప్రజల, మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షల కోసం పని చేయాలి” అని మేఘాలయ ముఖ్యమంత్రి జోడించారు.

PM Narendra Modi: అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ

చాలా తక్కువ సమయంలో రాష్ట్ర ఎన్నికలు జరగడం తమకు పెద్ద సవాల్‌ అని కాన్రాడ్ సంగ్మా అన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎన్డీయేపై ఉన్న అవగాహనపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన వెల్లడించారు. ఎన్డీయేతో రాజకీయంగానూ, సమస్యలపైనా తమకు అవగాహన ఉందన్నారు. కానీ కొన్ని అంశాల్లో కూడా రాజకీయంగా వారితో పొత్తు పెట్టుకోలేదని.. తమ స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 21 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ), పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, రెండు స్వతంత్ర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్‌లో ముకుల్ సంగ్మా, మరో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మమతా బెనర్జీ పార్టీ బెంగాల్ దాటి తన స్థావరాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నందున 17 మంది పార్టీ శాసనసభ్యులలో 12 మంది టీఎంసీలో చేరారు. ఈ సారి ఎన్నికలు జరిగితే టీఎంసీకి, ఎన్‌పీపీకి మధ్య పోటీ నెలకొననుంది.

Exit mobile version