Swatantra Bhardwaj: ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారు నిషూ అజాద్ తండ్రి సంజయ్ కుమార్పై దాడి చేశాడనే ఆరోపణల కారణంగా యాక్టివిస్ట్ స్వతంత్ర భరద్వాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బులంద్షహర్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిషూ ఆజాద్ తండ్రిపై దాడి చేసినట్లు ఒక పాడ్కాస్ట్లో అంగీకరించిన వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్ట్ జరిగింది.
2026 జూన్ 23న జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఫిర్యాదుదారుడైన సంజయ్ కుమార్, తన కుమార్తె నిషూతో కలిసి నిరసనల్లో పాల్గొనడానికి వచ్చిన సమయంలో స్వతంత్ర భరద్వాజ్తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సంజయ్ను చట్టుముట్టి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, తన ఆత్మరక్షణలో భాగంగా సీజేపీ కార్యకర్తల నుంచి తప్పించుకోవడానికి దాడి చేసినట్లు స్వతంత్ర చెబుతున్నారు.
స్వతంత్ర భరద్వాజ్ వీడియో వైరల్ కావడంతో అతడిని అరెస్ట్ చేయాలని శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 115(2), 126(2), మరియు 3(5) కింద ఎఫ్ఐఆర్ నంబర్ 62/2026 కేసు నమోదు చేశారు. ఈ కేసులో స్వతంత్ర భరద్వాజ్తో పాటు సూరజ్ కుమార్ను నిందితులుగా చేర్చారు. మరోవైపు, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. నిషూ ఆజాద్కు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

