Nepal: నేపాల్ని “హిందూ దేశం”గా ప్రకటించాలని ప్రజా ఉద్యమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఖాట్మాండులో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు. ఈ ఆందోళనల్ని పోలీసులు అర్డుకున్నారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దశాబ్ధకాలంగా 16,000 మందికి పైగా ప్రజలు మరణించిన తర్వాత అంతర్యుద్ధానికి ముగింపు పిలికి శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో పార్లమెంట్ రాచరికాన్ని రద్దు చేశారు. 2008లో హిందూ మెజారిటీగా ఉన్న దేశం సమాఖ్య వ్యవస్థతో లౌకిక రాజ్యంగా అవతరించింది.
అయితే, దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని, హిందూ దేశంగా మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. నేపాల్ పార్లమెంట్లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీ ప్రజాతంత్ర పార్టీ ఈ డిమాండ్లను చేస్తోంది. ‘‘మన దేశం, మన రాజు మాకు ప్రాణం కన్నా ప్రియమైనవారు’’ అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉఫయోగించినట్లు పోలీస్ అధికార ప్రతినిధి నవరాజ్ తెలిపారు.
Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
నేపాల్లో రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి నెమ్మది కావడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో రాజరికం కావాలని, హిందూ రాజ్యపునరుద్ధరణ జరగాలని మద్దతు పెరుగుతోంది. అధికారంలో ఉన్న వారు అవినీతి, అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన గుర్తింపు, సంస్కృతిని కాపాడటానికి రాజరికాన్ని పునరుద్ధరించడం కంటే వేరే మార్గం లేదని నిరసనకారులు చెబుతున్నారు.
2001లో నేపాల్ యువరాజు దీపేంద్ర అతని తండ్రి రాజైన బీరేంద్రతో పాటు 10 మందిని ఊచకోత కోశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత పరిణామాల్లతో రాజుగా జ్ఞానేంద్ర షా ప్రకటించబడ్డాడు. 76 ఏళ్ల ఈయన నేపాల్కి చివరి రాజు. అయితే, ఇతను నేపాల్ రాజకీయాలపై పెద్దగా వ్యాఖ్యానాలు చేయకుండా దూరంగా ఉన్నారు. రాచరికం పునరుద్ధరణకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!