Nepal: నేపాల్ని “హిందూ దేశం”గా ప్రకటించాలని ప్రజా ఉద్యమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఖాట్మాండులో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు. ఈ ఆందోళనల్ని పోలీసులు అర్డుకున్నారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దశాబ్ధకాలంగా 16,000 మందికి పైగా ప్రజలు మరణించిన తర్వాత అంతర్యుద్ధానికి ముగింపు పిలికి శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో పార్లమెంట్ రాచరికాన్ని రద్దు చేశారు. 2008లో హిందూ మెజారిటీగా ఉన్న దేశం సమాఖ్య వ్యవస్థతో లౌకిక రాజ్యంగా అవతరించింది.
అయితే, దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని, హిందూ దేశంగా మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. నేపాల్ పార్లమెంట్లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీ ప్రజాతంత్ర పార్టీ ఈ డిమాండ్లను చేస్తోంది. ‘‘మన దేశం, మన రాజు మాకు ప్రాణం కన్నా ప్రియమైనవారు’’ అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉఫయోగించినట్లు పోలీస్ అధికార ప్రతినిధి నవరాజ్ తెలిపారు.
Also Read
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
నేపాల్లో రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి నెమ్మది కావడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో రాజరికం కావాలని, హిందూ రాజ్యపునరుద్ధరణ జరగాలని మద్దతు పెరుగుతోంది. అధికారంలో ఉన్న వారు అవినీతి, అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన గుర్తింపు, సంస్కృతిని కాపాడటానికి రాజరికాన్ని పునరుద్ధరించడం కంటే వేరే మార్గం లేదని నిరసనకారులు చెబుతున్నారు.
2001లో నేపాల్ యువరాజు దీపేంద్ర అతని తండ్రి రాజైన బీరేంద్రతో పాటు 10 మందిని ఊచకోత కోశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత పరిణామాల్లతో రాజుగా జ్ఞానేంద్ర షా ప్రకటించబడ్డాడు. 76 ఏళ్ల ఈయన నేపాల్కి చివరి రాజు. అయితే, ఇతను నేపాల్ రాజకీయాలపై పెద్దగా వ్యాఖ్యానాలు చేయకుండా దూరంగా ఉన్నారు. రాచరికం పునరుద్ధరణకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!