Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు.
- సరిహద్దు వివాదాలపై చైనా, బ్రిటన్ సాయం కోరిన షా.
- బాలెన్ షా వ్యాఖ్యలపై సొంత దేశంలోనే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: భారత్-నేపాల్ మధ్య దశాబ్ధాలుగా సాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్ సాయం అవసరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, నేపాల్ భారత్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకుందని ప్రగల్భాలు పలికారు.
కాలాపాని, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలపై రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో లిపులేఖ్ గుండా భారత్, చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పున:ప్రారంభించే అంశంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కైలాస్ మానససరోవర్ యాత్ర లిపులేఖ్ పాస్ గుండా నిర్వహించడంపై నేపాల్ ప్రభుత్వం భారత్, చైనాలకు దౌత్యపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లిపులేఖ్ తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తోంది.
Also Read
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
ఈ వివాదాలను దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ వివాదాస్పద ప్రాంతాలపై నేపాల్ భారత్కు అధికారి దౌత్య లేఖ పంపిందని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చరిత్రకారులు, సర్వేయర్లు, సరిహద్దు నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించినట్లు చెప్పారు.
ఈ అంశంపై నేపాల్ చైనా, బ్రిటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భారత్ మాత్రమే కాకుండా, నేపాల్ కూడా భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిందని బాలెన్ షా చెప్పారు. అయితే, ఆయన ప్రకటనను సోషల్ మీడియాలో చాలా మంది నేపాలీ నెటిజన్లు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మాజీ దౌత్యవేత్తలు, నిపుణులు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!