Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు.
- సరిహద్దు వివాదాలపై చైనా, బ్రిటన్ సాయం కోరిన షా.
- బాలెన్ షా వ్యాఖ్యలపై సొంత దేశంలోనే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: భారత్-నేపాల్ మధ్య దశాబ్ధాలుగా సాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్ సాయం అవసరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, నేపాల్ భారత్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకుందని ప్రగల్భాలు పలికారు.
కాలాపాని, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలపై రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో లిపులేఖ్ గుండా భారత్, చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పున:ప్రారంభించే అంశంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కైలాస్ మానససరోవర్ యాత్ర లిపులేఖ్ పాస్ గుండా నిర్వహించడంపై నేపాల్ ప్రభుత్వం భారత్, చైనాలకు దౌత్యపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లిపులేఖ్ తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తోంది.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఈ వివాదాలను దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ వివాదాస్పద ప్రాంతాలపై నేపాల్ భారత్కు అధికారి దౌత్య లేఖ పంపిందని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చరిత్రకారులు, సర్వేయర్లు, సరిహద్దు నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించినట్లు చెప్పారు.
ఈ అంశంపై నేపాల్ చైనా, బ్రిటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భారత్ మాత్రమే కాకుండా, నేపాల్ కూడా భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిందని బాలెన్ షా చెప్పారు. అయితే, ఆయన ప్రకటనను సోషల్ మీడియాలో చాలా మంది నేపాలీ నెటిజన్లు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మాజీ దౌత్యవేత్తలు, నిపుణులు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!