Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు.
- సరిహద్దు వివాదాలపై చైనా, బ్రిటన్ సాయం కోరిన షా.
- బాలెన్ షా వ్యాఖ్యలపై సొంత దేశంలోనే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: భారత్-నేపాల్ మధ్య దశాబ్ధాలుగా సాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్ సాయం అవసరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, నేపాల్ భారత్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకుందని ప్రగల్భాలు పలికారు.
కాలాపాని, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలపై రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో లిపులేఖ్ గుండా భారత్, చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పున:ప్రారంభించే అంశంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కైలాస్ మానససరోవర్ యాత్ర లిపులేఖ్ పాస్ గుండా నిర్వహించడంపై నేపాల్ ప్రభుత్వం భారత్, చైనాలకు దౌత్యపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లిపులేఖ్ తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తోంది.
Also Read
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
ఈ వివాదాలను దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ వివాదాస్పద ప్రాంతాలపై నేపాల్ భారత్కు అధికారి దౌత్య లేఖ పంపిందని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చరిత్రకారులు, సర్వేయర్లు, సరిహద్దు నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించినట్లు చెప్పారు.
ఈ అంశంపై నేపాల్ చైనా, బ్రిటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భారత్ మాత్రమే కాకుండా, నేపాల్ కూడా భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిందని బాలెన్ షా చెప్పారు. అయితే, ఆయన ప్రకటనను సోషల్ మీడియాలో చాలా మంది నేపాలీ నెటిజన్లు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మాజీ దౌత్యవేత్తలు, నిపుణులు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?