Site icon NTV Telugu

Chandrayaan-3: ఇండియాకు చంద్రయాన్-3 గేమ్ ఛేంజర్.. మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్..

Nambi Narayanan

Nambi Narayanan

Chandrayaan-3: ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ నిర్వహిస్తున్న చంద్రయాన్-3 పైనే దృష్టిని కేంద్రీకరించాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని దించేందుకు చంద్రయాన్-3 మిషన్ ని ఇస్రో చేపట్టింది. ఇది సాధ్యమైతే ఈ ఘటన సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలుస్తుంది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగా సఫలం అయింది. ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయితే ఈ ప్రయోగంలో పంపిన విక్రమ్ ల్యాండర్, రోవర్ చివరి క్షణాల్లో చంద్రుడిపై కుప్పకూలిపోయాయి. ఈ వైఫల్యాలను అధిగమించి చంద్రయాన్-3ని సక్సెస్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఎల్వీఎం-3 రాకెట్ సాయంతో చంద్రయాన్-3 అంతరిక్షంలో జాబిల్లి వైపు ప్రయాణించనుంది.

Read Also: Nikhil: ప్లాప్ ఎఫెక్ట్.. ఆ కండీషన్లు పెట్టిన నిఖిల్.. ?

ఇదిలా ఉంటే ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 భారతదేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో భారత్ తన వాటాను పెంచుకునేందుకు ఈ ప్రయోగం సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2తో సంభవించిన సమస్యలను నివారించడానికి చంద్రయాన్-3 సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ మిషన్ సక్సెస్ ఫుల్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష వాటా పెరుగుతుంది. ప్రస్తుతం 600 బిలియన్ డాలర్ల పరిశ్రమలో ప్రస్తుతం 2 శాతం వాటాను కలిగి ఉంది. ఏరోస్పేస్ రంగంలో స్టారప్స్ వృద్ధికి ఆస్కారం పెంచుతుందని అన్నారు. దేశం మనుగడ సాగించాలంటే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన సాంకేతికత అవసరమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన ప్రయోగాలకు ఖర్చు తక్కువ అని వెల్లడించారు.

Exit mobile version