Italy: ఇటలీ విహారయాత్రలో విషాదం.. నాగ్పూర్కు చెందిన దంపతుల మృతి
- ఇటలీ విహారయాత్రలో విషాదం
- నాగ్పూర్కు చెందిన దంపతుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్పూర్కు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో వారి కుమార్తెతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
Also Read
జావేద్ అక్తర్(55), గుల్షన్(47) భార్యాభర్తలు. వీరికి ప్రఖ్యాత హోటలియర్ అనే హోటల్ నాగ్పూర్లో ఉంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తెలు అర్జూ అక్తర్ (21), షిఫా అక్తర్, కుమారుడు జాజెల్ అక్తర్ ఉన్నారు. కుటుంబమంతా యూరప్ విహారయాత్రకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి ఇటలీ చేరుకున్నారు. అక్కడ ఒక మినీ వ్యాన్లో పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. అయితే వీరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే దంపతులతో పాటు మినీ వ్యాన్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అర్జూ అక్తర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జాజెల్ అక్తర్కు స్పృహ రాగానే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి బాధితులను రక్షించారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయం అందకపోవడం వల్లే చనిపోయినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ సహాయం చేయలేదని తెలుస్తోంది. ఈ కారణంతోనే దంపతులు చనిపోయినట్లుగా సమాచారం. ఇక ప్రమాదంపై స్థానిక అధికారుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అర్జూ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. నాగ్పూర్ దంపతుల మరణాలకు ఇటలీలోని భారత రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!