Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ
- బెంగళూరు టెక్కీ విషాదగాధ
- నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం
- భార్య, కుమారుడి కళ్ల ముందే భరత్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ మారణహోమం.. ఎన్నో కుటుంబాల్లో చీకటి మిగిల్చింది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన ఒక్కో విషాదగాధ వెలుగులోకి వస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు.. కుటుంబాలకు ఆధారమైన ఎందరో భాగస్వాములను కోల్పోవడంతో బాధితులంతా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు.
బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్ (35) భార్య సుజాత, కుమారుడితో కలిసి పహల్గామ్కు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం కుమారుడిని ఎత్తుకుని భరత్ ఫొటో దిగుతున్నారు. భార్య సమీపంలో ఉండి ఫొటో తీస్తోంది. ఇంతలోనే ఉగ్రవాదులు వచ్చారు. కౌగిల్లో ఉన్న బిడ్డను ఇవ్వమని అడిగారు. అనంతరం పేరు.. మతం అడిగారు. తన పేరు భరత్.. తాను హిందువునని అని చెప్పాడు. ముస్లిం కాదని తెలియగానే తుపాకీ తలపై గురిపెట్టి.. భార్య, కుమారుడి ముందే భరత్ను కాల్చేశారు. భరత్ భూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య సుజాత.. బెంగళూరు రామయ్య ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తోంది. భర్త కళ్ల ముందే చనిపోవడంతో మూడేళ్ల కుమారుడితో ఆమె గజగజ వణికిపోయింది.
Also Read
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ప్రొఫెసర్ ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం
భరత్ కుటుంబం బెంగళూరులోని మత్తికెరెలోని సుందర్నగర్లో నివాసం ఉంటున్నారు. కుమారుడి మరణ వార్త వినిగానే 74 ఏళ్ల చెన్నవీరప్ప దు:ఖంలో మునిగిపోయారు. స్థానికులంతా కంటతడి పెట్టారు. కాల్పులకు ముందు కుమారుడు భరత్ ఫోన్ చేసి.. కాశ్మీర్ అందాలు వీడియో కాల్లో చూపించాడని చెన్నవీరప్ప గుర్తుచేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు మరణవార్త తెలిసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మరణవార్త తెలిసిందన్నారు. పెద్ద కొడుకు ప్రీతమ్, కోడలికి మరణవార్త ముందుగానే తెలుసని.. కంగారు పడతామని తమకు చెప్పలేదని వాపోయాడు. మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పెద్ద కొడుకు ప్రీతమ్ కాశ్మీర్కు బయల్దేరాడని.. భరత్ గాయపడ్డాడని చెప్పి కాశ్మీర్ వెళ్లాడన్నారు. చెన్నవీరప్ప భార్య శైలకుమారి(72)కి కుమారుడి మరణవార్త తెలియక.. కుమారుడు క్షేమంగా రావాలని ప్రార్థించింది. తన కుమారుడికి హిందీ నటుడు భరత్ భూషణ్ పేరు పెట్టినట్లు చెన్న వీరప్ప తెలిపారు.
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్, బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ భౌతికకాయాలు ప్రస్తుతం ఇళ్లకు చేరాయి. స్థానిక నేతలంతా బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య భౌతికకాయాలకు నివాళులు అర్పించారు.
ఇది కూడా చదవండి: Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..
#WATCH | Karnataka | Rituals before the final rites of Bharat Bhushan – a resident of Bengaluru, who was killed in the #PahalgamTerroristAttack, are being performed.
Final rites will be performed later today. pic.twitter.com/zpYyU50kcw
— ANI (@ANI) April 24, 2025
#WATCH | Karnataka | Bharat Bhushan from Bengaluru and Manjunath Rao from Shivamogga were killed in the #PahalgamTerroristAttack, their mortal remains have been brought to Bengaluru.
Union Minister Veeranna Somanna and BJP MP Tejasvi Surya pay floral tribute. The BJP MP was in… pic.twitter.com/SiphcDVOnD
— ANI (@ANI) April 24, 2025
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!