Shaik Shabnam: రామునిపై భక్తికి మతంతో పనేంటి? అయోధ్యకు ముస్లిం యువతి పాద్రయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ మందిరం ప్రారంభోత్సవానికి అయోధ్య భక్తులందరికి పిలుపునిస్తోంది. జనవరి 22న దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రాల సీఎంలకు, ప్రముఖ రాజకీయ నేతలకు ఆహ్వానం అందింది. ఇక తమిళనాడు నుంచి రాముని గుడి గంటలు కూడా బయలుదేరాయి. పలువురు భక్తులు రామయ్యకు కానుకలు సమర్పిస్తూ భక్తిని చాటుకుంటున్నార. మరోవైపు భక్తులు అయోధ్యకు పాద్రయాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలో రామయ్య సేవకు నేను సైతం అంటూ ఓ ముస్లిం యువతి కూడా కదిలింది.
Also Read: TS Inter Exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
Also Read
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ముంబై నుంచి అయోధ్యకు నడకయాత్రం చేపట్టి సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పింది. రామునిపై భక్తి ఉండాలంటే హిందువే కానవసరం లేదంటూ ముంబై నుంచి అయోధ్యకు 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకన బయలుదేరింది. ఆ యువతి పేరు షేక్ షబ్నం. ప్రస్తుతం షబ్నం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మారింది. ఇక సోషల్ మీడియా, మీడియాల్లో ఆమె గురించే చర్చించుకుంటున్నారు. పుట్టుకతోనే ముస్లిమైన షబ్నం.. రాముని పట్ల అచంచలమైన భక్తితో అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. శ్రీరాముడు పాటించిన విలువలు, ఆచరణ ఎందరికో స్ఫూర్తి అంటుంది.
అలాంటి రామయ్యాను ఆరాధించేందుకు హిందువే కానవసరం లేదని గర్వంగా చెబుతోంది. మంచి మనిషిగా ఉండడమే ముఖ్యమంటూ అయోధ్యకు పయనమైంది. అలా నడకయాత్రన షబ్నం ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని సింధవకు చేరుకుంది. ప్రతిరోజూ 25-30 కిలోమీటర్లు మేర నడుస్తూ ముంబై నుంచి ఇప్పటికి మధ్యప్రదేశ్కు చేరుకుంది. ఈ సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తనని నడిపిస్తోందని షబ్నమ్ తెలిపింది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను పొగోడతానంది. ఈ క్రమంలో ఆమె యాత్రం ఎంతోమంది పలకరిస్తూ షబ్నమ్కు కొనియాడుతున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Also Read: Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
అంతేకాదు అవసరమైతే తనకు కావాల్సిన సాయం కూడా చేస్తామంటున్నారు. అయితే షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నా.. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని ఆమె చెబుతుంది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది ‘జై శ్రీరామ్’ అని నినాదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!