దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
నేటి నుంచి మరిన్ని సడలింపులు…తెరుచుకోనున్న మ్యూజియాలు…
![](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2021/06/3-13-1024x768.jpg)