Video: కలెక్టరేట్లో వృద్ధ అన్నదాత పొర్లు దండాలు.. కళ్లప్పగించి చూసిన అధికారులు..!
- కలెక్టరేట్లో వృద్ధ అన్నదాత పొర్లు దండాలు
- కళ్లప్పగించి చూసిన అధికారులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతా సుఖీభవ.. అన్నదాత విజయీభవ అంటారు పెద్దలు. కర్షకుడు.. ఆరుగాలం కష్టపడి.. పండిస్తే.. ప్రజలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అందుకే రైతేరాజు అన్నారు. అలాంటి అన్నదాతకు కష్టం వస్తే.. కనికరించే నాథుడే లేకుండా పోయాడు. తనకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్కు వచ్చి పొర్లు దండాలు పెట్టినా.. పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
తన భూమిని ల్యాండ్ మాఫియా కాజేశారని… వారి నుంచి కాపాడి తనకు ఇప్పించాలని ఓ వృద్ధ రైతు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపాడు. చేతులు జోడించి కలెక్టరేట్ ఆఫీస్ నేలపై దొర్లుతూ పొర్లు దండాలు పెట్టాడు. ఆ సమయంలోనూ అధికారులు.. అలా చేశారే తప్ప.. ఆపే ప్రయత్నమూ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు... అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
వీడియోలో పొర్లు దండాలు పెడుతున్న రైతు పేరు.. శంకర్లాల్(65). ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించుకుందంట. వారి నుంచి దానిని తిరిగి తనకు ఇప్పించాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారుల్లో చలనం రాకపోవడంతో పొర్లు దండాలతో ‘న్యాయం చేయండి ప్రభో’ అంటూ వేడుకున్నాడు. మందసౌర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు శంకర్లాల్ ఆరోపించారు. తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదని రైతు శంకర్లాల్ వాపోయాడు. ఇదిలా ఉంటే వివాదాస్పద భూమి శంకర్లాల్ ఆధీనంలోనే ఉందని స్థానిక యంత్రాంగం అంటుంది.
यह किसान मंदसौर का हैं, इसका आरोप है कि इसका ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है … लेकिन लाख कोशिश करने के बाद भी पुलिस ने इसकी मदद नहीं की जिसके बाद यह कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटेने लगा pic.twitter.com/63VgHqpHfz
— Priya singh (@priyarajputlive) July 17, 2024
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు… అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!