Noida: కర్కశులుగా మారిన సహోద్యోగులు.. బ్యాంక్ మహిళా ఉద్యోగి ఆత్మహత్మ
- కర్కశులుగా మారిన సహోద్యోగులు
- బ్యాంక్ మహిళా ఉద్యోగి ఆత్మహత్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగి. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అదే సహోద్యోగులకు రుచించలేదు. నిత్యం ఆమెకు నరకం చూపించారు. క్షణం.. క్షణం కుమిలిపోయింది. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. ఇక టర్చర్ భరించలేక.. ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన నోయిడా యాక్సిస్ బ్యాంక్లో చోటుచేసుకుంది.
27 ఏళ్ల శివాని త్యాగి నోయిడాలో యాక్సిస్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పని చేస్తుంది. అయితే ఆమె సహోద్యోగులు పనిగట్టుకుని తీవ్ర వేధింపులకు గురి చేశారు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శివాని ప్రాణం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
2023, అక్టోబర్లో శివాని కంపెనీలో చేరింది. శివాని శాకాహారిని.. కానీ తోటి ఉద్యోగి జ్యోతి.. మధ్యాహ్న భోజనంలో మాంసాహారం కలిపేది. దీంతో ఆమె ఒంటరిగా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె రాజీనామా చేసినా ఆమోదించలేదు. ఇక ఇంట్లోనే ఒంటరిగా ఏడూస్తూ ఉండేదని బాధితురాలి సోదరుడు తెలిపాడు. పలుమార్లు కొట్టడం.. జుట్టు పట్టుకుని లాకడం.. వ్యక్తిగత ఖాతాలోంచి డబ్బులు కూడా తీసుకున్నారని వాపోయాడు. పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. ఆ బాధలు భరించలేక ఘజియాబాద్లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది.
ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!