Manmohan Singh: మన్మోహన్ సింగ్ పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద నిరాశ’’..
- భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..
- ఆయన పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద విచారం’’ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం ఎయిమ్స్లో మరణించారు. దాదాపుగా దివాళా అంచున ఉన్న దేశాన్ని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్కి దక్కుతుంది. అప్పటి వరకు లైసెన్స్ రాజ్, బ్రూరోక్రసీ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థగా మార్చారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్కి దారులు తెరిచారు. దీని వల్ల రెండేళ్లలోనే భారత్ దివాళా అంచు నుంచి మెరుగైన విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా మారింది. పీవీ నరసింహరావు హయాంతో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే, ఇలాంటి వ్యక్తి తన జీవితంలో అత్యుత్తమ క్షణం, అతిపెద్ద విచారం ఉన్నాయని చెప్పారు. జనవరి 3, 2014న ప్రధానమంత్రిగా తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో డాక్టర్ సింగ్ను ప్రధానమంత్రిగా ఈ రెండింటి గురించి చెప్పారు. ‘‘ సామాజిక, ఆర్థిక మార్పుల ప్రక్రియను అణిచివేసేందుకు ప్రయత్నించిన అణు వర్ణవివక్షను అంతం చేయడానికి అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని తన కెరీర్లో ‘‘అత్యుత్తమ క్షణం’’. మనదేశం అనేక విధాలుగా సాంకేతిక అభివృద్ధి చెందుతోంది’’ అని ఆయన చెప్పారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Bhatti Vikramarka: మన్మోహన్ సింగ్ మృతి దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
అణుశక్తి, సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA), ఆగస్టు 2008లో భారతదేశంతో భద్రతా ఒప్పందాన్ని ఆమోదించింది. దీని తర్వాత అమెరికా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)ని సంప్రదించి, భారత్కి పౌర అవసరాల కోసం టెక్నాలజీని బదిలీ చేయడానికి మినహాయింపు ఇచ్చింది.NSG సెప్టెంబరు 6, 2008న భారతదేశానికి మినహాయింపును మంజూరు చేసింది.
మన్మోహన్ సింగ్ తన పాలనలో ‘‘అతిపెద్ద విచారం’’గా ఆరోగ్య సంరక్షణ రంగమని చెప్పారు. ఈ రంగంలో తాను అనుకున్నంతగా పనిచేయలేదని వెల్లడించారు. “నన్ను క్షమించండి. నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఖచ్చితంగా, నేను ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, మహిళలకు ఆరోగ్య సంరక్షణలో చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నాను. మేము ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆకట్టుకునే ఫలితాలను సాధించింది, అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!