Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న సస్పెన్స్..
- రాజీనామాకు ఒప్పుకోని మమతా బెనర్జీ..
- కీలకంగా మారిన గవర్నర్ అధికారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బీజేపీ ఘన విజయం సాధించి, టీఎంసీ ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని, రాజ్ భవన్ వెళ్లనని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల ఫలితాలను దొంగిలించిందని, 100 నియోజకవర్గాల్లో విజయం దొంగిలించబడిందని ఆమె ఆరోపించారు. నైతిక విజయం తమదే అంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లను దక్కించుకుంది. అయితే, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయిందంటూ ఆమె ఆరోపించారు. తాను ఓడిపోలేదని స్పష్టం చేశారు.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పార్టీ ఓడిపోతే సీఎం గవర్నర్కు తన రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే, బెంగాల్ పరిణామాలు మాత్రం దేశానికి కొత్తగా ఉన్నాయి. ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలంటే ‘‘శాసన సభ’’ విశ్వాసం అనేది ప్రాథమిక సూత్రం. ఎన్నికల్లో ఓడిపోయానని తెలిసిన తర్వాత మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సి ఉంది. అయినా ఆమె ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
గవర్నర్ రంగ ప్రవేశం:
సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెట్టు చేస్తే, గవర్నర్ యాక్టీవ్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ కొన్ని చర్యల్ని తీసుకోవచ్చు. ఇందులో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయవచ్చు. అంటే దీని అర్థం శాసనసభను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావచ్చు.
మరో చర్య ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టిలక్ 164(1)ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని ప్రకారం, ముఖ్యమంత్రి ఆమె మంత్రివర్గం ‘‘గవర్నర్ విశ్వాసం ఉన్నంత కాలం’’ పదవిలో కొనసాగుతారు. దీని ద్వారా గవర్నర్ ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు. ఇదే సమయంలో మరో ఆప్షన్ కూడా గవర్నర్ వద్ద ఉంది. మమతా బెనర్జీని తన మెజారిటీ నిరూపించుకోవచ్చని ఆదేశించవచ్చు. అయితే, దీనికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు 80 స్థానాలు మాత్రమే లభించాయి. ఇది మెజారిటీ మార్కు కన్నా 68 సీట్లు తక్కువ.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!