West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
- మాజీ సీఎం మమతా బెనర్జీకి ఘోర అవమానం..
- దొంగ దొంగ అంటూ న్యాయవాదుల నినాదాలు..
- కలకత్తా హైకోర్టు వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి వరసగా ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో పరాజయం పాలైన దీదీని ఉద్దేశిస్తూ ‘‘దొంగ, దొంగ’’ అంటూ పలువురు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం హింస, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కేసు వాదించడానిక గురువారం ఆమె కలకత్తా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఆమె కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా, ఆమెను ఉద్దేశిస్తూ కొందరు ‘‘దొంగ..దొంగ’’ అంటూ నినాదాలు చేశారు.
Read Also: Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ఈ షాకింగ్ పరిణామంతో మమతా బెనర్జీ .. ‘‘వారు నాపై దాడి చేశారు’’ అంటూ విలేకరులతో అన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మమతా కోర్టు విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీతో పాటు, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీని బీజేపీ ప్రభావం ఉన్న నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి టీఎంసీ న్యాయ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పింది. ఒకరిని దొంగగా, బందిపోటుగా ముద్ర వేయడానికి కోర్టు సరైన ప్రదేశం కాదని హితవు పలికింది. మమతా బెనర్జీకే ఇలాంటి పరిస్థితి ఉంటే, బెంగాల్లో టీఎంసీ కార్యకర్తల పరిస్థితిని ఊహించుకోండి అని కళ్యాన్ బెనర్జీ అన్నారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసింది. మే 4న విడుదలై ఫలితాల్లో 294 సీట్లకు గానూ బీజేపీ 207 గెలిస్తే, టీఎంసీ 80 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగినట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కలుగజేసుకోవాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్లతో కూడిన ధర్మాసనం ముందు మమతా వాదించారు.
Chor Chor slogans raised at Mamata Banerjee at Calcutta High Court. pic.twitter.com/p1oNqaR05Q
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 14, 2026
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!