West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
- మాజీ సీఎం మమతా బెనర్జీకి ఘోర అవమానం..
- దొంగ దొంగ అంటూ న్యాయవాదుల నినాదాలు..
- కలకత్తా హైకోర్టు వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి వరసగా ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో పరాజయం పాలైన దీదీని ఉద్దేశిస్తూ ‘‘దొంగ, దొంగ’’ అంటూ పలువురు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం హింస, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కేసు వాదించడానిక గురువారం ఆమె కలకత్తా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఆమె కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా, ఆమెను ఉద్దేశిస్తూ కొందరు ‘‘దొంగ..దొంగ’’ అంటూ నినాదాలు చేశారు.
Read Also: Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ఈ షాకింగ్ పరిణామంతో మమతా బెనర్జీ .. ‘‘వారు నాపై దాడి చేశారు’’ అంటూ విలేకరులతో అన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మమతా కోర్టు విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీతో పాటు, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీని బీజేపీ ప్రభావం ఉన్న నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి టీఎంసీ న్యాయ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పింది. ఒకరిని దొంగగా, బందిపోటుగా ముద్ర వేయడానికి కోర్టు సరైన ప్రదేశం కాదని హితవు పలికింది. మమతా బెనర్జీకే ఇలాంటి పరిస్థితి ఉంటే, బెంగాల్లో టీఎంసీ కార్యకర్తల పరిస్థితిని ఊహించుకోండి అని కళ్యాన్ బెనర్జీ అన్నారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసింది. మే 4న విడుదలై ఫలితాల్లో 294 సీట్లకు గానూ బీజేపీ 207 గెలిస్తే, టీఎంసీ 80 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగినట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కలుగజేసుకోవాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్లతో కూడిన ధర్మాసనం ముందు మమతా వాదించారు.
Chor Chor slogans raised at Mamata Banerjee at Calcutta High Court. pic.twitter.com/p1oNqaR05Q
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 14, 2026
తాజావార్తలు
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!