NTV Telugu Site icon

Mumbai: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాక్ నుంచి బెదిరింపులు.. పోలీసుల దర్యాప్తు

Devendra Fadnavis

Devendra Fadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి 9 పేజీల బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్‌!

వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపు సందేశం తర్వాత దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. కారును పేల్చేస్తామని ఈమెయిల్ ద్వారా బెదిరించారు. గోరేగావ్, జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లకు ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించాయి. సందేశం పంపిన వ్యక్తి ఐపీ చిరునామాను ట్రాక్ చేస్తున్నారు. ఇక బెదిరింపు తర్వాత షిండే భద్రతను పెంచారు.

ఇది కూడా చదవండి: AP Agriculture Budget: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ హైలైట్స్‌.. రైతులకు శుభవార్త..