Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?

  • దేవుడి ముందు అందరూ సమానమే: మద్రాస్ హైకోర్టు
  • VIP దర్శనాలపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు
  • “దేవుడు VIPల కోసం ఎదురుచూడాలా?” అంటూ ప్రశ్న
  • మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యేక దర్శనాలపై అసంతృప్తి
Vip Darshan

Vip Darshan

Madras High Court: ఆలయాల్లో కొనసాగుతున్న VIP దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమే అని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించుకోవడం మంచిది కాదని కోర్టు స్పష్టం చేసింది. VIPల కోసం దేవుడు ఎదురుచూస్తూ ఉండాలా.? అని ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టులో ఈ అంశంపై విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే వృద్ధులు, వికలాంగులు, గర్భిణిలు, కొత్తగా వివాహం జరిగిన జంటలకు, రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ హోదా కలిగిన వారికి మినహాయింపు ఇవ్వవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు.

×
×
Ad

మే 15న తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఒక మంత్రి దర్శనం కోసం ఆలయ సమయాన్ని పొడగించారనే ఆరోపణలపై కోర్టు గతంలో వివరణ కోరింది. అయితే ఆలయ సమయాన్ని పొడగించలేదని తమిళనాడు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. పూర్తిగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, కోర్టు 6 వారాల సమయం ఇచ్చింది.

ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆలయంలోకి వెళ్లవచ్చని, దేవుడు వారి కోసం ఎదురుచూస్తాడని భావించకూడదని, వీఐపీ దర్శనాలు ఎందుకు కావాలి? దేవుడు అందరికి సమానమే కదా అని వ్యాఖ్యానించింది.సనాతన ధర్మం ధనికుడు, పేదవాడు అనే భేదాన్ని చూపడదని, అందర్ని సమానంగా చూస్తుందని, అదనపు డబ్బు తీసుకుని ప్రత్యేక దర్శనాలు కల్పించడం హిందూ శాస్త్రాల్లో ఎక్కడా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది భక్తుల నుంచి డబ్బులు దోచుకోవడమే అని ఆరోపించారు. ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ కల్చర్ పెరిగిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19,21,25లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు.