Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..

  • మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం..
  • 30 మందితో వెళ్తున్న పడవ మునక..
Boat Accident

Boat Accident

Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బర్గి డ్యామ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ నర్మదా నది బ్యాక్ వాటర్‌లో అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోట్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం.

Read Also: Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!

నర్మదా నది బ్యాక్ వాటర్ లో ప్రయాణిస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారి బలమైన ఈదురుగాలులు వీచడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా నది అలలు, బలమైన గాలుల కారణంగా క్రూయిజ్ షిప్ తన బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో క్షణాల్లో నీటిలో మునిగిపోయింది.
స్థానికంగా పడవ నడిపేవారు, అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 15 మందిని నీటి నుంచి సురక్షితంగా రక్షించారు. రెస్క్యూ బృందాలు నాలుగు మృతదేహాలను వెలికితీశాయి. ఇంకా గల్లంతైనవారి కోసం డైవర్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.