NTV Telugu Site icon

Lucknow Building Collapses: లక్నోలో కూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

Lucknowbuildingcollapses

Lucknowbuildingcollapses

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో మధ్యాహ్న సమయంలో 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను ఆసియానా ప్రాంతంలోని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.