New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New LPG Rules: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మార్పులు ముఖ్యంగా సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం, నకిలీ కనెక్షన్లను నియంత్రించడం లక్ష్యంగా తీసుకొచ్చినవిగా తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి గ్యాస్ కనెక్షన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్ మరియు చమురు దిగుమతులు ప్రభావితమవుతున్నాయి. దీంతో దేశంలో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరాను నియంత్రించేందుకు మరియు వినియోగాన్ని పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
ఈ నిబంధనల్లో ముఖ్యంగా డబుల్ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ మీ ఇంటికి ఇప్పటికే పీఎన్జీ (పైప్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ ఉంటే, ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ను తప్పనిసరిగా రద్దు చేయాల్సి రావచ్చు. ఈ నియమాన్ని పాటించకపోతే, ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను నిలిపివేయవచ్చు. ఇక, ఎల్పీజీ వినియోగదారులు తమ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేయాలి. కేవైసీ పూర్తి కాకపోతే సిలిండర్ రీఫిల్ సేవలు అందకపోవచ్చు. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అదనంగా, అనేక ప్రాంతాల్లో OTP ఆధారిత గ్యాస్ డెలివరీ వ్యవస్థను కూడా తప్పనిసరి చేస్తున్నారు. వినియోగదారుల మొబైల్ నంబర్కు వచ్చే OTP ద్వారా మాత్రమే సిలిండర్ డెలివరీ అందుతుంది. ఇది అక్రమ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. జూన్ 2025కి ముందు గ్యాస్ రీఫిల్ చేయించిన వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఖాతాలను నిష్క్రియంగా పరిగణించే అవకాశం ఉంది. కేవైసీ పూర్తి చేయకపోతే, కొత్తగా సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఇక ద్వంద్వ ఇంధన వినియోగంపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. పీఎన్జీ మరియు ఎల్పీజీ రెండింటినీ ఉపయోగిస్తున్న గృహాలను గుర్తించి, సబ్సిడీ ప్రయోజనాలను పరిమితం చేసే చర్యలు చేపడుతున్నారు.
వినియోగదారులు చేయాల్సినవి
* ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి.
* మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేసి OTP డెలివరీకి సిద్ధంగా ఉంచాలి.
* సబ్సిడీ కోసం ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయిందో లేదో పరిశీలించాలి.
* నకిలీ లేదా నిష్క్రియ కనెక్షన్లు ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలి.
* మీ ప్రాంతంలో పీఎన్జీ కనెక్షన్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలి.
ఈ కొత్త నిబంధనలను సమయానికి పాటిస్తేనే ఎల్పీజీ సేవలను అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు. లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్ నిలిపివేయబడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!