Loud speakers row: మహారాష్ట్ర్రలో కాకరేపుతున్న లౌడ్ స్పీకర్స్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా మహాారాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహరాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు వినిపిస్తే దానికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మే 3 వరకు గడువు రాజ్ ఠాక్రేకు శివసేన సర్కార్ కు గడువు విధించారు. దీనికి తోడు ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ రాణా… సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు ‘ మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా వినిపించేందుకు సిద్ధం కావడం.. ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.
మహారాష్ట్రలో హిందుత్వం కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. హఠాత్తుగా రాజ్ ఠాక్రే లౌడ్ స్పీకర్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం రాజేయడంతో హిందుత్వాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ఎంఎన్ఎస్, రాజ్ ఠాక్రే వెనక బీజేపీ పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రోద్భలంతోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
అధికారం కోసం శివసేన భావవైరుధ్యం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టడంతో… శివసేన తన హిందుత్వాన్ని విడిచిపెట్టిందనే భావన కలిగించేలా ఎంఎన్ఎస్ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని రాజేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు శివసేన హిందుత్వ పార్టీ ఉండీ ప్రస్తుతం తన సిద్ధాంతాన్ని విడిచిపెట్టిందనే భావన ప్రజల్లో కలిగించేలా.. మహారాష్ట్రలో హిందుత్వానికి బ్రాండ్ గా నిలిచేలా రాజ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హిందుత్వానికి శివసేన స్కూల్ వంటిదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రాజ్ ఠాక్రేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజ్ ఠాక్రేకు పలు 2008లోని ఓ కేసులో రాజ్ ఠాక్రేకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్ట్. ఈ పరిణామాల మధ్య వచ్చే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..