Karnataka: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కర్నాటక ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP)తో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయడం, విక్రయించడం మరియు నిమజ్జనం చేసే వారిపై పర్యావరణ (రక్షణ) చట్టంలోని కఠినమైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది..
పండుగకు ముందు తయారు చేసిన గణేశుడు, గౌరీ విగ్రహాలతో పాటు, పీవోపీతో తయారు చేసిన విగ్రహాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చినట్లు సెప్టెంబర్ 15 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. డిప్యూటీ కమిషనర్లు, అన్ని విభాగాల అధిపతులతో పాటు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కెఎస్పిసిబి) మరియు ఇతరులకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి..ఈ క్రమంలో పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం వివరాల్లోకి వెళ్లింది. పీఓపీ (కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్) విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గిపోయి దాని గట్టిదనం పెరుగుతుందని పేర్కొంది.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ఈ విగ్రహాలకు ఉపయోగించే రసాయన రంగులు పాదరసం, ఆర్సెనిక్, సీసం, క్రోమియం, కాపర్, కాడ్మియం, కోబాల్ట్, జింక్ మరియు ఇతర ప్రమాదకరమైన భారీ లోహాలు విడుదల చేయడం ద్వారా నీటిని కూడా కలుషితం చేస్తాయి. ఇది చేపలు మరియు ఇతర జలచరాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. ఈ నీటిని వినియోగించే వ్యక్తులు మరియు పశువులకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అని ఆర్డర్ పేర్కొంది.
చట్టంలోని సెక్షన్ 15 (1) నీటిని కలుషితం చేసే నిబంధనలను ఉల్లంఘించిన వారితో సహా చట్టంలోని ఏదైనా నిబంధనలను పాటించడంలో విఫలమైనా లేదా ఉల్లంఘించినా ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తుంది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు KSPCB జూలై 2016లో PoP విగ్రహాల తయారీ మరియు విక్రయాలను నిషేధించింది. అయితే అమలు, అవగాహన లేకపోవడంతో ఏటా లక్షల సంఖ్యలో పీఓపీ విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు..గత రెండు నెలలుగా, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వివిధ శాఖల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు..
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!