Karnataka: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కర్నాటక ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP)తో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయడం, విక్రయించడం మరియు నిమజ్జనం చేసే వారిపై పర్యావరణ (రక్షణ) చట్టంలోని కఠినమైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది..
పండుగకు ముందు తయారు చేసిన గణేశుడు, గౌరీ విగ్రహాలతో పాటు, పీవోపీతో తయారు చేసిన విగ్రహాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చినట్లు సెప్టెంబర్ 15 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. డిప్యూటీ కమిషనర్లు, అన్ని విభాగాల అధిపతులతో పాటు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కెఎస్పిసిబి) మరియు ఇతరులకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి..ఈ క్రమంలో పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం వివరాల్లోకి వెళ్లింది. పీఓపీ (కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్) విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గిపోయి దాని గట్టిదనం పెరుగుతుందని పేర్కొంది.
Also Read
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
ఈ విగ్రహాలకు ఉపయోగించే రసాయన రంగులు పాదరసం, ఆర్సెనిక్, సీసం, క్రోమియం, కాపర్, కాడ్మియం, కోబాల్ట్, జింక్ మరియు ఇతర ప్రమాదకరమైన భారీ లోహాలు విడుదల చేయడం ద్వారా నీటిని కూడా కలుషితం చేస్తాయి. ఇది చేపలు మరియు ఇతర జలచరాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. ఈ నీటిని వినియోగించే వ్యక్తులు మరియు పశువులకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అని ఆర్డర్ పేర్కొంది.
చట్టంలోని సెక్షన్ 15 (1) నీటిని కలుషితం చేసే నిబంధనలను ఉల్లంఘించిన వారితో సహా చట్టంలోని ఏదైనా నిబంధనలను పాటించడంలో విఫలమైనా లేదా ఉల్లంఘించినా ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తుంది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు KSPCB జూలై 2016లో PoP విగ్రహాల తయారీ మరియు విక్రయాలను నిషేధించింది. అయితే అమలు, అవగాహన లేకపోవడంతో ఏటా లక్షల సంఖ్యలో పీఓపీ విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు..గత రెండు నెలలుగా, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వివిధ శాఖల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు..
తాజావార్తలు
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..