Karnataka: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కర్నాటక ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP)తో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయడం, విక్రయించడం మరియు నిమజ్జనం చేసే వారిపై పర్యావరణ (రక్షణ) చట్టంలోని కఠినమైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది..
పండుగకు ముందు తయారు చేసిన గణేశుడు, గౌరీ విగ్రహాలతో పాటు, పీవోపీతో తయారు చేసిన విగ్రహాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చినట్లు సెప్టెంబర్ 15 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. డిప్యూటీ కమిషనర్లు, అన్ని విభాగాల అధిపతులతో పాటు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కెఎస్పిసిబి) మరియు ఇతరులకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి..ఈ క్రమంలో పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం వివరాల్లోకి వెళ్లింది. పీఓపీ (కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్) విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గిపోయి దాని గట్టిదనం పెరుగుతుందని పేర్కొంది.
Also Read
ఈ విగ్రహాలకు ఉపయోగించే రసాయన రంగులు పాదరసం, ఆర్సెనిక్, సీసం, క్రోమియం, కాపర్, కాడ్మియం, కోబాల్ట్, జింక్ మరియు ఇతర ప్రమాదకరమైన భారీ లోహాలు విడుదల చేయడం ద్వారా నీటిని కూడా కలుషితం చేస్తాయి. ఇది చేపలు మరియు ఇతర జలచరాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. ఈ నీటిని వినియోగించే వ్యక్తులు మరియు పశువులకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అని ఆర్డర్ పేర్కొంది.
చట్టంలోని సెక్షన్ 15 (1) నీటిని కలుషితం చేసే నిబంధనలను ఉల్లంఘించిన వారితో సహా చట్టంలోని ఏదైనా నిబంధనలను పాటించడంలో విఫలమైనా లేదా ఉల్లంఘించినా ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తుంది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు KSPCB జూలై 2016లో PoP విగ్రహాల తయారీ మరియు విక్రయాలను నిషేధించింది. అయితే అమలు, అవగాహన లేకపోవడంతో ఏటా లక్షల సంఖ్యలో పీఓపీ విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు..గత రెండు నెలలుగా, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వివిధ శాఖల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!