Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానినిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన చేశారు. తన వారికి మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, రాజీనామా చేసినా కూడా అధికారంలో ఉండాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రభుత్వంలో లేనప్పటికీ, రాజకీయంగా శక్తివంతంగా ఉండేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ‘సమన్వయ కమిటి’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం పనితీరు, పార్టీ ఆశయాలకు మధ్య సమన్వయం చేస్తుంది. ఈ కమిటీకి సిద్ధరామయ్య బాధ్యత వహించాలని ఆశించారు. అయితే, సిద్ధరామయ్య నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది.
2018లో కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో హెచ్డీ కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ, సిద్ధరామయ్య సమన్వయ కమిటీకి నేతృత్వం వహించారు. ఆయన ప్రభుత్వం లేనప్పటికీ, ప్రభుత్వంలో సీఎం కానీ సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థనే సిద్ధరామయ్య కోరుకున్నారు. అయితే, ఆ సమయంలో జేడీఎస్, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కమిటీ ఎందుకని కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య ప్రతిపాదనను తిరస్కరించింది.
