ఉత్తరప్రదేశ్కు ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇరువురు చేసిన ప్రమాణాలతో వివాహం గ్రాండ్గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ వివాహం రాజస్థాన్లో గ్రాండ్గా జరిగింది. జోధ్పూర్లోని అజిత్ ప్యాలెస్లో వివాహం జరిగింది. బిష్ణోయ్ మోకాలిపై కూర్చుని అన్షికా వర్మకు పూలమాల వేశారు. ఇద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అంటే ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్లు అర్థమవుతోంది.
ఐపీఎస్ అన్షికా వర్మ ఎరుపు రంగు పెళ్లి లెహంగా ధరించగా.. కేకే బిష్ణోయ్ ఆఫ్ వైట్ రంగు షేర్వానీలో చాలా అందంగా కనిపించారు. అన్షికా వర్మకు దండ వేసేటప్పుడు కేకే బిష్ణోయ్ మోకాళ్లపై వంగిన దృశ్యం వివాహ వేడుకలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో కైలాష్ ఖేర్ పాడిన ‘ఓ రీ సఖీ మంగళ్ గావ్ రీ’ పాట ప్లే అవుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా సినిమా సన్నివేశంలా మారిపోయింది.
అన్షికా వర్మ దండ వేయడానికి ముందుకు రాగానే.. కేకే బిష్ణోయ్ మొదట కొద్దిగా వెనక్కి జరిగి.. ఆ తర్వాత చిరునవ్వుతో మోకరిల్లారు. అనంతరం ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పైకి ఎత్తారు. ఇక బిష్ణోయ్ రేంజ్ రోవర్లో వచ్చి.. ఆ తర్వాత గుర్రంపై స్వారీ చేశారు. దారి పొడవునా పెళ్లి బృందం నృత్యం చేసింది. పెళ్లి వేడుకలు రాత్రంతా కొనసాగాయి.
ఇక సోమవారం జోధ్పూర్లోని లారియా రిసార్ట్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీనికి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లకు చెందిన పలువురు సీనియర్ పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
