Site icon NTV Telugu

మరోసారి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు..

flights

కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ ప్రయాణలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో.. అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. నవంబర్‌ 30వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించినట్టు… డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన ప్రత్యేక విమానాలకు వర్తించదని తెలిపింది. కరోనా మహమ్మారితో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. గతంలో ఈ నిషేధాన్ని ఈ నెల 31 వరకు విధించగా, తాజాగా దీనిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version