Rare earths: ఈవీల నుంచి మిస్సైల్స్ వరకు.. “రేర్ ఎర్త్” మూలకాలు ఏమిటి.. భారత్కు ఎందుకు అవసరం..
- ఈవీల నుంచి మిస్సైల్స్ వరకు..
- సెల్ ఫోన్ల నుంచి టీవీల వరకు..
- పెరిగిన ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ ప్రాధాన్యత..
- రేర్ ఎర్త్ మూలకాలను సీరియస్గా తీసుకున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ అరుదైన మూలకాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మూలకాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాల్లో చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. దీనిని అడ్డుకోవాలంటే భారత్ ఈ రంగంలో స్వావలంభన సాధించాల్సి ఉంది.
రేర్ ఎర్త్ మూలకాలు మొత్తం 17 ఉంటాయి. ఇవి స్కాండియం, యుట్రియం, లాంతానమ్, సెరియం, నియోడిమియం, ప్రేసియోడియం, ఎర్బియం, యిబ్రియం ఇలా లాంతనైడ్ సిరీస్లో లోహాలను రేర్ ఎర్త్ మూలకాలుగా పిలుస్తారు. అరుదైన మూలకాలు మోనాజైట్ వంటి ఖనిజాల్లో దాగి ఉంటాయి. వీటిని వేరు చేయడం చాలా ఖరీదైన ప్రక్రియ. ఇది రేడియోధార్మి థోరియంతో సహా అనేక విష వ్యర్థాలను విడుదల చేస్తాయి. దశాబ్ధాలుతా బీచ్ ఇసుకను ఎగుమతి చేసి, పూర్తయిన అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్న భారత దేశం చివరకు రేర్ ఎర్త్ మూలకాలను తీవ్రంగా పరిగణిస్తోంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: MK Stalin: రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం.. తీవ్ర విమర్శలు చేసిన సీఎం స్టాలిన్…
నవంబర్ 27న, అధిక పనితీరు కలిగిన అరుదైన రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీకి కేంద్రమంత్రివర్గం రూ. 7280 కోట్ల ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రోత్సహక పథకాన్ని ప్రకటించింది. విద్యుత్ వాహనాలు, విండ్ టర్బైన్స్కు అవసరమైన నియోడైమియం బోరాన్ అయస్కాంతాలను ఉత్పత్తి చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు రూ. 350 కోట్లతో ప్రత్యక్ష నగదు ప్రోత్సహకాలను ప్రకటించింది. ఈ అయస్కాంతాలు చాలా చిన్నగా ఉండీ, శక్తివంతంగా ఉంటాయి.
నియోడిమియం ఇప్పటివరకు కనిపెట్టిన బలమైన శాశ్వత అయస్కాంతం. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల మోటర్లలో, విండ్ టర్బైన్లలో ఉపయోగిస్తారు. యూరోపియం, టెర్బియ స్క్రీన్లు స్పష్టమైన రంగులను ఇస్తాయి. సెరియం స్మార్ట్ఫోన్ గ్లాస్కు వాడుతారు. ఇది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి ఎగ్జాస్ట్ గ్యాసులను కూడా శుభ్రం చేస్తుంది. ఇదే కాకుండా క్షిపణులు, ఫైటర్ జెట్లు, ఎంఆర్ఐ యంత్రాలు, హార్డ్ డిస్క్లు ఇలా అన్నింటిలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవసరం.
చైనా ప్రపంచవ్యాప్తంగా అరుదైన భూమి మూలకాల సరఫరాలో 60 శాతం తవ్వుతుంది,దాదాపు 90 శాతం శుద్ధి చేస్తుంది. 2010లో జపాన్తో దౌత్య వివాదం సందర్భంగా ఆ దేశానికి ఎగుమతుల్ని నిలిపేసింది. దీంతో వారాల్లోనే ఈ రేర్ ఎర్త్ ధరలు 500 శాతం పెరిగాయి. కార్ల కర్మాగారాలు ఆగిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలోని ఒడిశా, కేరళ, తమిళనాడదు తీరాల వెంబడి మోనజైట్ బీచ్ ఇసుక ఉంది. ఇది ప్రపంచ రేర్ ఎర్త్లో ఒక శాతం మాత్రమే. అనేక దశాబ్ధాలుగా భారత్ దీనిని ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాలు దీనిని శుద్ధి చేసి, అయస్కాంతాలు తయారు చేస్తే 10 రెట్ల ధర చెల్లించి మళ్లీ దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద రేర్ ఎర్త్ డిపాజిట్స్ కలిగిన ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పుడు జట్టు కడుతోంది. రేర్ ఎర్త్లో స్వయం స్వావలంభన దిశగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!