Site icon NTV Telugu

Hypersonic missile: హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్‌

Drdo

Drdo

Hypersonic missile: భారతదేశం తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఈరోజు (ఆదివారం) ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ పరీక్షతో భారత్‌ కూడా దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణులున్న దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే, 1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుందన్నారు. వివిధ రకాల వార్‌హెడ్‌లను అమర్చేలా ఈ క్షిపణిని డిజైన్‌ చేశారు. దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించడంతో భారత్‌ ఓ పెద్ద మైలురాయిని క్రాస్ చేసింది. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపంలో జరిగింది. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్‌ కూడా చేరినట్లైందని ఎక్స్‌ వేదికగా రక్షణ శాఖ పోస్టు చేసింది.

Read Also: Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్

అయితే, ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా మానిటరింగ్ చేశారు. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) వెల్లడించింది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లో ఈ హైపర్ సోనిక్ క్షిపణినీ రూపొందించారు. దేశంలోని ఇతర డీఆర్‌డీవో ల్యాబ్‌లు, పరిశ్రమలు దీనికి హెల్ప్ చేశాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది.

Exit mobile version