Independence Day Celebrations: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకకు జాతి సిద్ధం.. ముస్తాబైన ఎర్రకోట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day Celebrations: భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, 1947 ఆగస్టు 15న, భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తిని సాధించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం విదేశీ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు అవుతోంది. ఈమేరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తోంది. అలాగే హర్ ఘర్ తిరంగ ప్రచారం ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతి మొత్తాన్ని ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేస్తారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎగురవేసే సమయం ప్రకటించారు. ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.
ఈ వేడుకల కోసం ఎర్రకోటను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఆయన ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి కానుంది. ఉగ్రవాదులు, విద్రోహశక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ-కశ్మీర్ సహా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. 75 ఏళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం.
Also Read
Draupadi Murmu : అమర జవాన్ల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ పతాకావిష్కరణ చేయనున్న ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్ ఫ్లై జోన్’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, మెరికల్లాంటి స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దించారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించి, నేలకూల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్ క్రాప్ట్లపై మంగళవారం వరకు నిషేధం విధించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!