ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 84,565 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 289 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు మొత్తం 4,77,158 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 3,46,24,360 గా నమోదు అయింది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,36,66,05,173 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.
ఇండియా కరోనా అప్డేట్…
