Site icon NTV Telugu

COVID19: భారత్‌లో ఇవాళ ఎన్నికేసులంటే..?

భారత్‌లో కరోనా ఉధృతి తగ్గింది.. క్రమంగా రోజువారీ కేసుల సంఖ్య దిగివస్తోంది.. తాజాగా ఆ సంఖ్య 14 వేల కిందకు పడిపోయింది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 13,405 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 235 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 34,226 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు దేశ్యాప్తంగా 1,81,075గా ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,21,58,510కి పెరిగింది.. మరోవైపు.. కరోనాబారినపడి ఇప్పటి వరకు 5,12,344 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.

Read Also: Karnataka: శివమొగ్గలో టెన్షన్‌ టెన్షన్‌..

Exit mobile version