Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Nuclear Submarines Ins Aridaman Ins Taragiri

INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు

Published Date :April 3, 2026 , 12:05 pm
By Suresh Maddala
  • మరింత శక్తివంతంగా భారత్
  • నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు
  • ఇకపై శత్రువు గుండెల్లో దడే
INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్ రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారింది. నిన్నామొన్నటి దాకా ఒకెత్తు అయితే ఇప్పుడు మరోకెత్తుగా మారింది. తాజాగా భారత రక్షణ వ్యవస్థలో రెండు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు చేరాయి. దీంతో భారత బలం మరింత పుంజుకోనుంది. ఈ ఆయుధాల చేరికతో శత్రువు గుండెల్లో దడపుట్టాల్సిందే.

భారత నౌకాదళం మరింత శక్తివంతంగా మారబోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. శత్రువును భయపెట్టేందుకు ఐఎన్ఎస్ అరిదమాన్, ఐఎన్ఎస్ తారాగిరిలను నౌకాదళానికి అప్పగించబోతున్నట్లు పేర్కొన్నారు. రెండు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బలమైన అణు జలాంతర్గామి‌లు. మొదటిది ఐఎన్ఎస్ అరిదమాన్ కాగా.. రెండవది అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి. ఈ రెండు కూడా శత్రు దేశాలు భారత జలాలు వైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణికిపుట్టిస్తాయి.

Also Read

  • Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
  • 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

‘‘ఇవి కేవలం మాటలు కాదు.. ఇది శక్తి.’’ అని ఎక్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్ రాసుకొచ్చారు. ‘‘ఈ జలాంతర్గామి భారతదేశపు సముద్ర అణు భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.’’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘‘ఐఎన్ఎస్ తారాగిరి’’ని నౌకాదళానికి రాజ్‌నాథ్‌సింగ్ అప్పగించనున్నారు.

ఐఎన్ఎస్ అరిదమన్ సుదూర క్షిపణులతో కూడి ఉంది. ఇది శత్రువులను మరింత దూరం నుంచి లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ జలాంతర్గామి ఇప్పుడు తన తుది సముద్ర పరీక్షలను పూర్తి చేసుకుంది. త్వరలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ప్రవేశించబోతుంది. దీనికి ముందు 2016లో ఐఎన్ఎస్ అరిహంత్, ఆగస్టు 2024లో ఐఎన్ఎస్ అరిఘాట్ ప్రవేశపెట్టారు.

రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘తారాగిరి’ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమయంలోనే ‘‘అరిదమాన్’’ గురించి కూడా ప్రస్తావించారు. ఈ జలాంతర్గామి ఏప్రిల్, మే నెలల మధ్య సేవలోకి ప్రవేశిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి డిసెంబర్ 2025లోనే తెలిపారు. ప్రస్తుతం తుది పరీక్షలు పూర్తయ్యాయి

స్టెల్త్ టెక్నాలజీ: ఇందులో మెరుగైన సోనార్-శోషక పూత, శబ్దాన్ని తగ్గించే సాంకేతికత ఉన్నాయి, దీంతో శత్రువులు దీనిని గుర్తించడం కష్టమవుతుంది.
దీర్ఘ పరిధి: కె-4 క్షిపణులతో ఇది శత్రువు యొక్క లోతట్టు భూభాగాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది భారతదేశ భద్రతకు అత్యంత కీలకం.
స్వదేశీ సాంకేతికత: ఈ జలాంతర్గామి సుమారు 70 శాతం స్వదేశీ సామగ్రిని ఉపయోగిస్తుంది. ఇది భారతదేశ స్వావలంబనను చాటిచెబుతుంది.

शब्द नहीं शक्ति है, ‘अरिदमन’!

— Rajnath Singh (@rajnathsingh) April 3, 2026

Tomorrow, 03 April, I shall be in Visakhapatnam to attend the Commissioning Ceremony of the advanced stealth Frigate ‘Taragiri’.

This commissioning highlights the strategic and maritime importance of India’s eastern seaboard as well as the Indian Navy’s sustained focus on… pic.twitter.com/rOSxZ9Ftuz

— Rajnath Singh (@rajnathsingh) April 2, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India navy
  • Indian defense news
  • indigenous defense technology
  • INS Aridaman
  • INS Taragiri

తాజావార్తలు

  • Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!

  • Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?

  • Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు

  • SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions